Monday, April 29, 2024

మ‌జిలీకి నాలుగేళ్లు.. ట్వీట్ చేసిన స‌మంత‌

హీరో నాగ‌చైత‌న్య‌..హీరోయిన్ స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం మజిలి. ఈ చిత్రం రిలీజ్ అయి నాలుగేళ్లు పూర్త‌యింది.ఈ మూవీని శివ నిర్వాణ తెర‌కెక్కించాడు. 2019 ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రానికి ఆడియెన్స్ తో పాటు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. అటు నాగచైతన్య, ఇటు సమంత నటనకు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. అయితే ఈరోజుతో ఈ చిత్రం విడుదలై నాలుగేండ్లు పూర్తైంది. ఈ సందర్భంగా సామ్ తన మెమోరీస్ ను షేర్ చేసుకున్నారు. కాగా మజిలి నాలుగేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ఇంట్రెస్టింగ్ గా పోస్టు పెట్టారు.

డైరెక్టర్ శివ నిర్వాణతో కలిసి మజిలి’ సెట్స్ లో సందడి చేసిన ఓ ఫొటోను పంచుకుంది. లవ్ యూ శివ నిర్వాణ. శ్రావణి లాంటి రోల్ ను అందించినందుకు. ప్రస్తుతం ఖుషిలో ‘ఆరాధ్య’తో అదరగొడుదాం’ అంటూ తన ఫీలింగ్ ను షేర్ చేసుకున్నారు. అలాగే మజిలిలోని తన ఎంట్రీ సీన్ ను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. ఆ పోస్టులను ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖుషి . విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ చకాచకా కొనసాగుతోంది. సెప్టెంబర్ 1, 2023న తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక సమంత నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement