Thursday, May 16, 2024

16మంది మల్లయోధులను సత్కరించిన ‘పవన్ కల్యాణ్’

దర్శకుడు క్రిష్ ..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పవన్ కి ఇది 27వ చిత్రం. పీరియాడికల్ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో   భారీ ఎత్తున చార్మినార్ సెట్ వేసి అక్కడే ఈ సినిమాకు సంబంధించి కీలకమైన పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుండి వచ్చిన 16 మంది మల్లయోధులు షూటింగ్‌లో పాల్గొన‌గా వారిని తాజాగా జ‌న‌సేన కార్యాల‌యంలో స‌న్మానించారు ప‌వ‌న్.16 మంది మ‌ల్ల‌యోధుల‌ని పేరుపేరున ప‌ల‌క‌రించి,శాలువా క‌ప్పి, వెండి హ‌నుమంతుడి విగ్ర‌హాన్ని బ‌హుక‌రించారు. తెలుగు మ‌ల్ల‌యోధుడు శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారి గొప్ప‌త‌నాన్ని వారికి వివ‌రించారు. శ్రీకాకుళం జిల్లా మారుమూలు ప‌ల్లెలో పుట్టిన ఆయ‌న ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత యోధుడిగా ఎలా ఎదిగారు, దేశ విదేశాల‌లో సాహ‌కృత్యాలు చేసే స్థాయికి ఎలా చేరుకున్నారో వారికి తెలియ‌జేశారు ప‌వ‌న్. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ చేస్తున్న మూవీ ఫ‌స్ట్ లుక్, టైటిల్ మార్చి 11న రివీల్ చేయ‌నున్నారు మేక‌ర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement