Sunday, April 28, 2024

ఏపీలో కేసులు తగ్గుతున్న మరణాలు తగ్గట్లేదు…104 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే టెస్ట్ లు కూడా తగ్గుతున్నాయి. గడిచిన 24గంట‌ల్లో మొత్తం 79,564 మందికి మాత్ర‌మే ప‌రీక్ష‌లు చేయ‌గా,కొత్తగా 13,756కేసులు న‌మోద‌య్యాయి. మ‌రోవైపు మహమ్మారి కారణంగా 104మంది మృతి చెందారు.

ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,392మంది క‌రోనాను నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా మృతి చెందిన వారిలో పశ్చిమ గోదావరి జిల్లాల్లో 20 , చిత్తూరులో 13, విశాఖపట్నంలో 10, అనంతపూర్ లో 9, తూర్పుగోదావరి లో తొమ్మిది, గుంటూరులో ఎనిమిది, కృష్ణాలో ఎనిమిది, కర్నూలు ఏడుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు కడప లో ఇద్దరూ ప్రకాశం లో ఒకరు మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement