Thursday, March 28, 2024

అంబులెన్స్‌కు డబ్బుల్లేవు.. బైక్‌పైనే మృతదేహం తరలింపు

కరోనా టైమ్ లో అంబులెన్సుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకటి రెండు కిలోమీటర్లకు కూడా రూ.వేలల్లో ఛార్జీలు అడుగుతున్నారు. దీంతో అంబులెన్స్ డబ్బులు లేక బైక్ మీద వృద్ధుడి మృతదేహాన్ని తరలించిన ఘటన ఖమ్మం మండలంలోని ఆత్కూరు సమీపంలో చోటు చేసుకుంది.

మల్లారానికి చెందిన ఎర్రనాగుల నారాయణ(70)కు సుమారు వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మధిరలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో శుక్రవారం గుండెల్లో నొప్పిగా ఉందని అతడు కుటుంబసభ్యులతో కలిసి మోటారుసైకిల్‌పై మధిరకు వస్తున్నాడు. సిరిపురం గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్ద చూపించుకోగా ఆయన మధిరలోని ఆసుపత్రిలో వైద్యం చేయించుకోమని సూచించాడు. అక్కడ అంబులెన్స్ కోసం ప్రయత్నించగా వేలకు వేలే అడిగారట. ఇక మరో ఆప్షన్ లేక బైక్ మీదే మధిరకు తీసుకెళ్తుండగా ఆత్కూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బైకుపై మృతి చెందాడు. అలాగే ఇంటికి బైక్ పైఅడుగుతున్నారని అదే బైకుపై ఇంటికి తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement