Thursday, May 16, 2024

లక్ష బడ్జెట్..ఆరు గంటల్లో సినిమా నిర్మించిన ‘శృతి’

కేవలం లక్ష రూపాయల బడ్జెట్..ఆరు గంటల సమయంలో ఓ మూవీ షూట్ జరిగింది. ఈ రోజుల్లో ఓ చిత్రాన్ని తీయాలంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి..నెలలు..సంవత్సరాలు ఆ సినిమా తీయడానికి పట్టే సమయం కూడా ఎక్కువే. కానీ  కేవలం లక్ష రూపాయల బడ్జెట్‌తో ఆరు గంటల వ్యవధిలోనే.. ఓ సినిమా నిర్మాణం పూర్తిచేశారు. ఆ సినిమా పేరు ‘ది మస్కిటో ఫిలాసఫి’. గతంలో ‘లెన్స్’‌ చిత్రానికి దర్శకత్వం వహించిన జయప్రకాష్‌ రాధాకృష్ణన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాను హీరోయిన్ శృతిహాసన్  నిర్మించారు. జతిన్‌ శంకర్‌ రాజ్‌ కెమెరామెన్‌. ఈ చిత్రంలో కేవలం సురేష్‌, దర్శకుడు జయప్రకాష్‌ రాధాకృష్ణన్‌లు మాత్రమే నటించారు. ముందుగానే ఎలాంటి స్ర్కిప్టును సిద్ధం చేయకుండానే.. అప్పటికప్పుడు అనుకుని (ఆన్‌దిస్పాట్‌)తీశారు. ఎలాంటి సంభాషణలు వుండని ఆ చిత్రం చెన్నైలో జరుగుతున్న 18వ ఇంటర్నేష‌నల్‌‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈనెల ఫిబ్రవరి 23వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ప్రదర్శితం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement