Sunday, May 19, 2024

మెగాభిమానికి ‘చిరంజీవి’ చేయూత

మెగాస్టార్ చిరంజీవి ఓ సీనియర్ మెగాభిమానికి  చేయూత నిచ్చారు.   అనారోగ్యంతో బాధ పడుతున్న సీనియర్‌ మెగాభిమాని.. వెంటనే కోలుకోవాలంటూ ఆయనకు మెగాస్టార్‌ లక్ష రూపాయల సాయం అందించారు.  కడపకు చెందిన సీనియర్ మెగాభిమాని పి సురేష్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం అఖిల భారత చిరంజీవి యువతకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన.. కడప జిల్లా అఖిల భారత చిరంజీవి యువతకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎనలేని సేవలు చేసిన అనుభవశాలి. మెగాస్టార్ చిరంజీవిగారంటే ప్రాణం కన్నా మిన్నగా అభిమానించే ఆయన మెగాస్టార్‌ చిరంజీవి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం సురేష్ అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ కదిరిలో ఉంటున్నారు. చికిత్స నిమిత్తం ప్రతి రెండు రోజులకు ఒకసారి కదిరి నుండి కడప, తిరుపతి వెళ్తూ వస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో, ఆర్థికంగా సతమతమవుతున్న సురేష్‌కి మెగాస్టార్ రూ. లక్ష సాయం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement