Thursday, May 9, 2024

మళ్లీ కలిసిన స్నేహితులు

కమెడియన్..నటుడు ఆలీ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.  జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో ప్రవేశించారు పవన్ కల్యాణ్. గత ఎన్నికల సమయంలో ఆలీ వైసీపీలో చేరారు. అనంతరం జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇద్దరి మధ్య ఎడం పెరిగిందన్న వార్తలు వినిపించాయి. అది నిజమే అనిపించేలా చాన్నాళ్ల పాటు వారిద్దరూ కలుసుకున్నది లేదు. అయితే  తాజాగా ఆలీ ఇంట జరిగిన ఓ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్, ఆలీ మాట్లాడుకుంటున్న  ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నది ఆలీ అర్ధాంగి జుబేదానే. మొత్తానికి స్నేహితులిద్దరూ మళ్లీ ఒకే ఫ్రేములో కనిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement