Sunday, May 12, 2024

‘దిల్ రాజు’ చేతిలో బాలయ్య మూవీ ఉత్తరాంధ్ర హక్కులు

హీరోగా బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. బోయపాటి డైరెక్షన్ లో బాలయ్యకి మూడవ చిత్రం ఇది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తోంది. మరో హీరోయిన్ పూర్ణ కీలక పాత్రలో యాక్ట్ చేయనుంది. . ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా మే 28న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సినిమాపై ఉన్న క్రేజ్‌తో సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే సినిమాకు ఫ్యాన్సీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయని సినీ వ‌ర్గాల స‌మాచారం.  ఇప్ప‌టికే ఆంధ్ర ఏరియా థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ.35కోట్లకు అమ్ముడ‌య్యాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం నైజాం, ఉత్త‌రాంధ్ర హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు రూ.16 కోట్ల రూపాయ‌లకు ద‌క్కించుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాంబినేష‌న్‌పై ఉన్న క్రేజ్‌తో ఒక్కొక్క ఏరియా హ‌క్కుల‌ను సొంతం చేసుకోవ‌డానికి డిస్ట్రిబ్యూట‌ర్స్ పోటీ ప‌డుతున్నార‌ని టాక్ ట్రేడ్ వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement