Friday, May 3, 2024

ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ‘సల్మాన్’ పెయింటింగ్స్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మంచి నటుడే కాదు పెయింటర్ కూడా. సల్మాన్ పెయింటింగ్ ప్రతిభ గుర్తించిన నిర్వాహకలు బెంగళూరులో జరిగే ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో సల్మాన్ పెయింటింగ్ లను ప్రదర్శించనున్నారట. ప్రముఖ భారత చిత్రకారుడైన రాజారవివర్మ పెయింటిగ్ చిత్రాలతో పాటు సల్మాన్ పెయింటింగ్స్ కూడా ప్రదర్శించనున్నారట. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా తన సోషల్ మీడియాలో తెలిపాడు. అబనీంద్రనాథ్‌ ఠాగూర్‌, వీఎస్‌ గైతోండే, ర‌వి వ‌ర్మ వంటి అద్భుత‌మైన క‌ళ‌కారుల మ‌ధ్య నా పెయింటింగ్ ప్ర‌ద‌ర్శించ‌నుండ‌టం చాలా ఆనందాన్ని క‌లిగిస్తుంది. ఇది చాలా అరుదైన గౌర‌వం. అంద‌రికి నా ధ‌న్య‌వాదాలు అని స‌ల్మాన్ త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో తెలియ‌జేశాడు.  ప్ర‌స్తుతం స‌ల్మాన్ రాధే అనే చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా రంజాన్‌కు విడుద‌ల కానుంది. ఇందులో దిశా క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు  మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైగర్ 3’, ‘కబీ ఈద్ కబీ’ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement