Monday, May 6, 2024

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 262 పాయింట్ల మేర పెరిగి 50899 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 15257 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక నిఫ్టీ బ్యాంకు సూచీ 34757, మిడ్‌క్యాప్‌ సూచీ 25661 పాయింట్ల వద్ద ఉంది. బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఏసియన్‌ పెయింట్స్‌, గ్రాసిం, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఇక మంగళవారం ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో నేడు లాభాలతో ఆరంభమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 72.77 వద్ద ట్రేడ్ అవుతోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement