Sunday, May 19, 2024

స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ రోజు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు నిమిషాల వ్యవధిలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం లాభాల్లోకి మళ్లాయి. అయితే చివర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో స్వల్ప నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 18 పాయింట్ల నష్టంతో 52,861కి దిగింది. నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 15,818 వద్ద స్థిరపడింది.

ఇది కూడా చదవండి: నోకియా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్

Advertisement

తాజా వార్తలు

Advertisement