Monday, April 29, 2024

కీవే నుంచి కొత్తగా 300ఐ రెట్రో క్లాసిక స్కూటర్‌..

ప్రభన్యూస్ : హంగేరికి చెందిన కీవే కంపెనీ తన కొత్త బ్రాండ్‌ను సిక్స్‌ టీస్‌ 300ఐ అండ్‌ వియోస్ట్‌ 300లను ఇండియా మార్కెట్‌లో పరిచయం చేస్తూ ప్రకటనలో పేర్కొన్నది. ఈ బ్రాండ్‌ స్కూటర్లు వినియోగదారుల నుంచి మంచి ప్రతిస్పందన పొందుతున్నాయని, వీటి ప్రారంభ ధర రూ.2,99,000 లు ఉంటుందని పేర్కొన్నారు ప్రతినిధులు. హంగెరీలో 1999లో ఏర్పాటు చేసిన కీవే కంపెనీ అధునాతన సాంకేతి కతతో కూడిన కాలానికి అనుకూలంగా కొత్తగా ఆవిష్కారాలు చేస్తుందని, అందులో భాగంగానే ఈ రెట్రో క్లాసిక్‌ స్కూటర్‌ను పరిచయం చేస్తుందని తెలిపారు.

దీనిలో ప్రత్యేకత ఏమిటంటే సిమ్‌ కార్డుతో కూడిన సాంకేతికతో ఈ స్కూటర్‌ పనిచేస్తుందని, కీవే కనెక్ట్‌ సిస్టమ్‌ తో ఈ స్కూటర్‌ పనిచేస్తుందని తెలిపారు. దీని ద్వారా స్కూటర్‌ తస్కరించడానికి వీలు లేకుండా, స్కూటర్‌ ఎక్కడ ఉన్నా లొకేషన్‌ గుర్తించేలా జియో ట్యాగ్‌ చేయబడి అది కూడా ఇంజిన్‌ ను ఆన్‌ ఆఫ్‌ చేసేలా పూర్తి సాంకేతికతో తయారు చేయబడినదని, అందుకే దీనికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుందని వారు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement