Sunday, May 19, 2024

బిగ్‌ సీ లో ఆషాడం ఆఫర్లు..

హైదరాబాద్‌ : ఆషాడమాసం సందర్భంగా మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌సి ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. ప్రతి స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలుపై 1999 రూపాయల విలువ గల గిజ్‌మోర్‌ ఇయర్‌ ఫోన్స్‌ కేవలం 99 రూపాయలకు, లేదా 3999 రూపాయల విలువగల గిజ్‌మోర్‌ స్మార్ట్‌ వాచ్‌ను 499 రూపాయలకే ఇవ్వనున్నట్లు సంస్థ చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.బాలు చౌదరి తెలిపారు. వీటితో పాటు స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్స్‌ కొనేవారికి ఆకర్షణీయమైన సులభ వాయిదా పద్ధతిలో ఫైనాన్స్‌ అభిస్తుందని చెప్పారు. ప్రతి స్మార్ట్‌ టీవీ కొనుగోలుపై 5199 విలువ ఉన్న ఫింగర్స్‌ స్పీకర్‌ను కేవలం 2999 కే ఇస్తామని చెప్పారు. ప్రతి ల్యాప్‌టాప్‌ కొనుగోలు పై ఒక ఈఎంఐ, ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌, యారో హెడ్‌ సెట్‌ ఉచితంగా ఇస్తామన్నారు. వీటితో పాటు బ్రాండెడ్‌ యాక్సెరిస్‌పై 51 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నామని, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి 5 శాతం క్యాస్‌బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తున్నట్లు వివరించారు.

ఐఫోన్‌ కొనుగోలుపై 4 వేలు, సామ్‌సంగ్‌ మొబైల్స్‌ కొనుగోలుపై 7 వేలు, ఒన్‌ప్లస్‌ కొనుగోలుపై 6 వేలు, వివో మొబైల్‌ కొనుగోలుపై 5 వేలు, ఒప్పో మొబైల్‌ కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ఎంఐ మొబైల్‌ కొనుగోలుపై 3 వేలు, ఎంఐ స్మార్ట్‌ టీవీల పై 7500 క్యాష్‌ బ్యాక్‌ ఇస్తున్నారు. ఒన్‌ప్లస్‌ టీవీల కొనుగోలుపై 5వేలు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఏటీఎం కార్డుల ద్వారా కొనుగులుపై ఎలాంటి డౌన్‌ పేమెంట్‌ లేకుండానే మొబైల్స్‌, స్మార్ట్‌ టీవీలు కొనుగోలు చేయవచ్చని బాలు చౌదరి వివరించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement