Thursday, May 2, 2024

నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ కు అరుదైన గౌరవం

కర్నూల్ జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారి నుండి అరుదైన గౌరవం దక్కింది. కరోనా విపత్కర సమయంలో ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలకు అండగా నిలిచారు. వైరస్ బారిన ప్రజలు పడకుండా చర్యలు తీసుకున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ కరోనాపై అవగాహన కల్పించి అధికారులను అప్రమత్తంగా చేశారు. అలాగే నియోజకవర్గంలోని వ్యవసాయ కూలీలకు మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు తమ సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆయన సేవలను గుర్తించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్..ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ కు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ను ప్రధానం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఎమ్మెల్యే ఆర్థర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement