Saturday, April 27, 2024

YSRCP – రాయ‌ల‌సీమ‌లో 26 నుంచి బీసీల కోసం సామాజిక బస్సు యాత్రలు – మంత్రి పెద్దిరెడ్డి

అనంతపురం అక్టోబర్ 19, అనంతపురం లో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. బీసీలకు మరింత దగ్గర అవడానికి సామాజిక బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు త్రి ప్రకటించారు. అనంతపురం, సత్య సాయి జిల్లాల ఎమ్మేల్యేలు, ఎంపిలు, ఇంచార్జ్ లు, నియోజకవర్గ పరిశీలకులు, కార్పొరేషన్ చైర్ పర్సన్స్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 26 నుంచి సామాజిక న్యాయ బస్సు యాత్ర నిర్వ‌హిస్తున్నామ‌ని అన్నారు.. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను మూడు ప్రాంతాలుగా విభజించి షెడ్యూల్ ఖరారు చేశామ‌న్నారు. ఈ నెల 26 నుండి నవంబర్ 9 వరకు 7 రాయలసీమ జిల్లాల్లో 7 సమావేశాలు నిర్వహిస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు.. ఈ నెల 26న శింగనమల నియోజకవర్గం నుండి బస్సు యాత్ర ప్రారంభం అవుతుంద‌ని, నాయకులు అందరూ పూర్తి స్థాయిలో శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల‌ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement