Tuesday, May 7, 2024

కడపలో దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారం.. నిందితుడు ఎవరంటే..

ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్లలో మార్పు మాత్రం రావడంతో లేదు. తాజాగా కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మానసిక పరిస్థితి బాగోలేని బాలికపై మేనత్త కొడుకే అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక (15) మానసిక దివ్యాంగురాలు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి నివాసం ఉంటుంది. దగ్గరలోని మేనత్త ఇంటికి అప్పుడప్పుడు వెళ్లేది. ఈ క్రమంలో అత్త కొడుకు శివ ఆ బాలికపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి శివ తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ క్రమంలో బాలికకు రక్తస్రావం కావడంతో తల్లి ఆసుపత్రిలో చూపించింది. దీంతో అసలు విషయం బయటపడింది. బాలిక అత్యాచారానికి గురైనట్లు వైద్యులు తెలిపారు. బాలిక మానసిక పరిస్థితి బాగోకపోవడంతో చెప్పలేకపోయింది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. యువకుడిపై అత్యాచారం చట్టం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement