Sunday, May 19, 2024

దక్షిణాది రాష్ట్రాల్లో యోగి ఆదిత్యనాథ్ పర్యటన.. ఎంపీ జీవీఎల్ విజ్ఞప్తిపై సానుకూల స్పందన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చేసిన విజ్ఞప్తిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సానుకూలంగా స్పందించారు. యూపీ ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకుని ఆదివారం ఢిల్లీ వచ్చిన యోగిని జీవీఎల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన విజయం చారిత్రాత్మకమని అభినందించారు. ఎన్నికల ఫలితాలపై వారిద్దరూ 15 నిమిషాల పాటు చర్చించారు.

దక్షిణాది నుంచి లక్షల సంఖ్యలో కాశీ, మథుర, ప్రయాగరాజ్, గోరఖ్‌నాథ్ పుణ్యక్షేత్రాలకు భక్తులు వస్తారని ఈ సందర్భంగా యోగి గుర్తు చేశారు. వారి సౌకర్యార్థం మెరుగైన వసతులు కల్పించాలని జీవీఎల్ చేసిన విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. భక్తులకు ఏ ఇబ్బందులూ రాకుండా వసతులు కల్పించడంలో అన్ని చర్యలూ చేపడతామని యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement