Monday, April 29, 2024

Flash: మహిళ దారుణ హత్య.. ఆస్తి తగాదాలే కారణం?

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని కాలేజీ సర్కిల్ లోని శ్రీ రమంజనేయ జనర్ స్టోర్ లో ప్రమిల అనే మహిళ దారుణ హత్యకు గురైంది. కిరణ దుకాణంలో పనిచేస్తున్న సరోజమ్మ ఉదయం యధావిధిగా దుకాణం వద్దకు రాగ దుకాణం తాళం లేకుండా కొంచం డోర్ తెరచి ఉంది. వెంటనే లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడివున్న తన యజమాని ప్రమిలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిసిలించి, మృతి చెందిన ప్రేమిల తలపై రక్తపు గాయాలు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం క్లూస్ టీం,డాంగ్ స్వాండ్ కు సమాచారం అందించారు.

రక్తపు మడుగులో పడి మృతి చెందిన తమ కూతురు ప్రేమిలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమిల హత్య వెనుక పలు రకాల కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆస్తి వివాదాలు కారణంగా ఆమెను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement