Sunday, May 5, 2024

నేర నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : నేర నియంత్రణ కొరకు అక్రమ రవాణా అరికట్టుటకు రహదారి ప్రమాదాల నివారణకు అన్ని పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశానుసారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తo ఈ-చలాన్‌లు 579 విధించినారు. ప్రమాదాల నివారణ కొరకు ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించడం వలన ప్రాణహాని ఉండదని, ఏదైనా ప్రమాద సమయంలో మీకు ప్రాణ రక్షణగా హెల్మెట్ ఉంటదని ప్రతి ఒక్కరూ గ్రహించాలని, వేగం వద్దు ప్రాణం ముద్దు అని, వాహనాలు నడిపే సమయంలో మీపై మీ కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని గ్రహించి ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement