Tuesday, May 14, 2024

Nara Lokesh: రాజమహేంద్రవరంకు లోకేష్.. పోలీసుల ఆంక్షలు

ఏలూరు బ్యూరో : తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ ఉద‌యం గ‌న్న‌వ‌రం నుంచి రాజమహేంద్రవరం రోడ్డు మార్గం ద్వారా వెళ్తుండ‌గా కలిసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలకు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు కల్పించారు. మార్గమధ్యంలో ఆయన్ను కలిసి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై ఆంక్షలు విధించారు.

లోకేష్ వాహన శ్రేణి వెళ్తున్న మార్గంలో పలుచోట్ల భారీగా పోలీసులు మోహరించారు. లోకేష్ తో నేతలు, కార్యకర్తలు రాజమహేంద్రవరం వెళ్లకుండా వారి వాహనాలను నిలిపివేస్తున్నారు. లోకేష్ ను ఏలూరు ఆశ్రమం కాలేజ్ బైపాస్ వద్ద మాజీ ఎంపి మాగంటిబాబు, ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) లు క‌లిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement