Wednesday, May 1, 2024

భారీగా గంజాయి ప‌ట్టివేత

ఏలూరు జిల్లాలో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. ద్వారకా తిరుమల మండలం కప్పలకుంట జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులను చూసి స్మగ్లర్లు ఇన్నోవా కారును వదిలిపెట్టి పారిపోయారు. దీంతో కారును సోదా చేయగా అందులో 350 కిలోల గంజాయి త‌ర‌లిస్తున్న‌ట్లు తెలిసింది. పోలీసులు గంజాయి, కారును స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement