Saturday, April 27, 2024

పెదవేగి ఎస్‌ఐ సస్పెన్షన్

ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులే ప‌ట్టించుకోక‌పోతే మా గోడు ఎవ‌రితో చెప్పుకోవాలో తెలియ‌క త‌ల్లీకూతురు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డంతో.. సకాలంలో కేసు నమోదు చేయక నిర్లక్ష్యం వహించిన ఏలూరు జిల్లా పెదవేగి ఎస్‌ఐ సత్యనారాయణపై ఏలూరు రేంజ్‌ డీఐజీ సస్పెన్షన్‌ చేశారు. ఓ యువ‌కుడు ప్రేమ పేరుతో త‌మ కుమార్తెకు మాయ‌మాట‌లు చెప్పి ఏలూరు తీసుకెళ్లాడ‌ని బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేయకుండా బాలిక తల్లిని స్టేషన్‌కు పిలిపించి విచారించడంతో ఆమె మనస్తాపానికి గురై ఇంటికి వచ్చి పురుగుల మందు తాగింది. అక్కడే ఉన్న కుమార్తె సైతం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల తీరువల్లే తన భార్య, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారని తండ్రి చేసిన ఆరోపణల మేరకు పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఇందులో ఎస్సై సత్యనారాయణ నిర్లక్ష్యం కనిపించడంతో అతడిని రేంజ్‌ డీఐజీ సస్పెన్షన్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement