Wednesday, May 15, 2024

ప్రధాని పర్యటనలో కాంగ్రెస్‌ నిరసన

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు విచ్చేసిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ నాయకులు తమదైన రీతిలో నిరసన తెలిపారు. గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ నుంచి మోదీ చాపర్‌ వెళుతుండగా నల్ల బెలూన్లను కాంగ్రెస్‌ నేతలు ఎగురవేశారు. దీంతో సెక్యూరిటీ పరంగా సీరియస్‌గా పోలీసులు తీసుకున్నారు. గాల్లో బెలూన్స్‌ ఎగరవేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరు బెలూన్స్‌ వదిలారన్నదానిపై దర్యాప్తు ప్రారంభించారు. చాపర్‌కు దగ్గరగా బ్లాక్‌ బెలూన్స్‌ వెళ్లినట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement