Tuesday, April 30, 2024

వైసీపీని బంగాళాఖాతంలో క‌లిపేలా మ‌హానాడు.. అచ్చెన్నాయుడు

వైసీపీని బంగాళాఖాతంలో కలిపేలా మహానాడు నిర్వహిస్తామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రాజమండ్రిలో టీడీపీ మహానాడు ప్రాంగణానికి అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు ఉంటుందని… జగన్ పాలనపై విధ్వంసాలు, వినాసాలపై మహానాడులో తీర్మానం అన్నారు.

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ మహానాడుకు అత్యంత ప్రాధాన్యమ‌ని, 100 అతి పెద్ద సభలు ప్రారంభించామని వివరించారు. 27వ తేదీ వరకు 99 పూర్తి చేస్తామని.. 28న ఎన్టీఆర్ శత జయంతి రోజు ముగింపు సభ ఉంటుందని వివరించారు. 15 వేల మందితో కమిటీలు, 15 తీర్మానాలు… 28న 15 లక్షల మందితో మహానాడు బహిరంగసభ ఉంటుందని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement