Tuesday, May 14, 2024

ఓట్ల తొలగింపుపై సీఈసీకి ఫిర్యాదు చేశాం.. పయ్యావుల కేశవ్

అనంతపురం జిల్లా చీలకగురికి గ్రామంలో ఓట్ల తొలగింపుపై సీఈసీకి ఫిర్యాదు చేశామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… నియోజకవర్గంలో మొత్తం 6వేల ఓట్ల తొలగించే కుట్ర జరిగిందన్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఓట్లు తొలగిస్తున్నారన్నారు. కొందరి సంతకాలు ఫోర్జరీ చేసి ఓట్లు తొలగించారన్నారు. హడావుడిగా ఇద్దరు బీఎల్ఓలను సస్పెండ్ చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల తొలగింపుపై సీఈసీకి ఫిర్యాదు చేస్తామని పయ్యావుల కేశవ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement