Monday, April 29, 2024

అన్ స్టాప‌బుల్2కి మంత్రి కేటీఆర్ తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్..

అన్ స్టాప‌బుల్2 షో కి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అతిథిగా హాజ‌రు కాబోతున్న‌ట్లు స‌మాచారం. అయితే ..మరో స్పెషల్ గెస్ట్ తో రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకి హాజరు కాబోతున్నారు. పవర్ ఫుల్ లీడర్ ..మంత్రి కేటీఆర్ తో కలసి చరణ్ ఈ షోలో సందడి చేయబోతున్నాడు. బాలయ్యకి ఇది మరో ఛాలెంజ్ అనే చెప్పాలి. ఒకవైపు పాన్ ఇండియా హీరో, మరోవైపు పొలిటీషియన్ కేటీఆర్ ఇద్దరినీ హ్యాండిల్ చేయాలి. కేటీఆర్, రాంచరణ్ ఇద్దరూ మంచి స్నేహితులు. గతంలో రాంచరణ్ సినిమా ఈవెంట్స్ కి కూడా కేటీఆర్ హాజరయ్యారు.

ఇక కేటీఆర్ తో.. బాలయ్యకి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. కేటీఆర్ ని పొలిటికల్ గా , రాంచరణ్ ని సినిమాల పరంగా ప్రశ్నిస్తూ బాలయ్య ఈ షోని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ లో రాంచరణ్ ఫోన్ లో బాలయ్యతో మాట్లాడారు. ఈ షోలో హాజరు కావాలని బాలయ్య కోరగా.. మనిద్దరికీ ఒక పిలుపు మాత్రమే దూరం సర్ అని రాంచరణ్ చెప్పాడు. అన్ స్టాపబుల్ షో లో బాలయ్య గెస్ట్ లని సరదాగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు సంధిస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. మరి బాలయ్య రాంచరణ్, కేటీఆర్ లని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement