వాలంటీర్ పై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో పింఛన్ల పంపిణీకి వెళ్తున్న వాలంటీర్పై ఎలుగుబంటి దాడి చేసింది. గ్రామంలోని చివరి వార్డులో పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళ్తున్న వాలంటీర్పై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలైన వాలంటీర్ను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement