Friday, March 29, 2024

కొనసాగుతోన్న మెట్రో టికెటింగ్ సిబ్బంది ధర్నా..

హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. నాగోల్ మెట్రో ఆఫీస్ దగ్గర టికెటింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. మెట్రోలో తమకు ఉచిత ట్రావెలింగ్, వసతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమ జీతం రూ.11 వేల నుంచి రూ.20 వేలకు పెంచాలంటున్నారు. మెట్రో ప్రాజెక్ట్ లో పని చేస్తున్న దాదాపు 300 మంది ఉద్యోగులు తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మెట్రోస్టేషన్స్ లో టికెటింగ్, మెయింటెనెన్స్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో బతుకు కష్టంగా మారిందని అందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలోనూ తమకు చాలా సమస్యలు ఉన్నాయని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement