Monday, May 6, 2024

Vishakhapatnam – తహశీల్దార్ హత్య కేసు నిందితుడు అరెస్ట్

విశాఖ తహసీల్ధారు హత్య కేసులో నిందితుడు గంగాధర్ నువిశాఖ పోలీసులు చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఏపీలో తీవ్ర సంచలనం రేపిన తాహసీల్దార్ హత్య కేసులో నిందితుడిని పట్టుకోవటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విశాఖ పోలీసులు గత రెండు రోజుల్లో పది బృందాలు శ్రమించాయి. మధురవాడలోని జ్యువెల్ పార్కు భూ వివాదమే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. రుషికొండ సమీపంలో ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్స్కన్వీనియన్స్ డీడ్ కోసం తాహసీల్దార్తో గంగారాం ఒప్పందం కుదుర్చుకున్నారని, వీరిద్దరి మధ్య రూ. 57 లక్షల చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది.

తహసీల్దారు రమణయ్య ఇటీవల విజయనగరం బదీలీ కాగా, పాత తేదీలతో సంతకాలు పెట్టాలంటూ గంగాధర్ డిమాండు చేయటంతో తాహసీల్దార్ నిరాకరించటంతో కక్షకట్టి రమణయ్యను హత్య చేసినట్టు పోలీసులకు నిందితుడు గంగారాం చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. హత్య చేసిన అనంతరం గంగాధర్ విమానంలో చెన్పైకు పారిపోయాడు.. అతడి సెల్ ఫోన్ అధారంగా చెన్నైలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విశాఖకు తీసుకొచ్చారు…

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement