Friday, May 17, 2024

కరోనాతో విశాఖ 31వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ వానపల్లి కన్నుమూత..

విశాఖపట్నం – గ్రేటర్ విశాఖ 31వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ కరోనాతో కన్నుమూశారు.. వారం రోజులు క్రితం కరోనా భారీన పడిన ఆయన విశాఖలోని ప్రైవేటు హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు.. నేటి ఉద‌యం ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించారు.. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు..కాగా, న్ టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతి టీడీపీ పార్టీకే కాదు, డివిజ‌న్ ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోటని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. రవికుమార్ కుటుంబ‌స‌భ్యుల‌కు తన ప్ర‌గాఢ సంతాపాన్ని తెలియ‌జేశారు. స్వ‌చ్ఛంద సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల హృద‌యాలు గెలుచుకున్న ర‌వికుమార్ మృత్యువుతో పోరాడి ఓడిపోవ‌డం బాధాక‌రమని లోకేష్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement