Sunday, April 28, 2024

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..

విశాఖలో ప్రొఫెసర్‌ మురళి దారుణ హత్య గురయ్యాడు. మారికవలసలోని రైల్వే బ్రిడ్జి దగ్గర ప్రొ.మురళి మృతదేహం లభ్యమైంది. పది రోజుల క్రితమే మురళి హత్యకు గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు. మురళి ఆఫ్రికాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న ఆఫ్రికా నుంచి విశాఖకు వచ్చిన మురళిని.. భార్య మృదుల తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. హత్య తర్వాత తన భర్త అదృశ్యమైనట్టు సీఎంపాలెం పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. మృదులపై అనుమానంతో పోలీసులు ప్రశ్నించగా… తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. మృదుల ప్రియుడు శంకర్‌ను అరెస్ట్‌ పోలీసులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement