ఈడీ ఆఫీసు నుంచి బయటికి వచ్చారు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ..కాగా రెండు గంటలపాటు సోనియాగాంధీని విచారించారు ఈడీ..నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈ రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకు సహకారంగా ఉండేందుకు ప్రియాంక గాంధీకి ఈడీ అనుమతించింది.
సోనియాను ప్రశ్నించే గదికి దూరంగా ఉన్న భవనంలో ప్రియాంక గాంధీ ఉండడానికి ఈడీ అధికారులు అనుమతించారు. తద్వారా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే ప్రియాంక తన తల్లి వద్దే ఉండి ఆమెకు మందులు అందించవచ్చని అధికారులు తెలిపారు. సోనియాను యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ కంపెనీలో అవకతవకల ఆరోపణలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు రెండు గంటల విచారణ తర్వాత సోనియా గాంధీ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఈడీ ఆఫీసు నుంచి తన నివాసానికి వెళ్లారు. దీంతో సోనియా గాంధీ తొలి రోజు విచారణ ముగిసింది. ఈ నెల 25వ తేదీన మరోమారు విచారణకు రావాల్సిందిగా సోనియాకు ఈడీ చెప్పినట్టుగా సమాచారం.