Monday, May 6, 2024

స్టీల్ ప్లాంట్ ని మూతపడనివ్వబోం..

విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎట్టిపరిస్థితుల్లో మూతపడనివ్వబోమని స్పష్టం చేశారు. చీఫ్ విప్ సామినేని ఉదయభాను. ప్రైవేటు వాళ్లు కొనకపోతే ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వమే కొనే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ కంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కే సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలని సామినేని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో అఖిలపక్ష నేతలను ప్రధాని మోడీ వద్దకు తీసుకెళతామని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విపక్షాలు వైసీపీతో కలిసిరావాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement