Tuesday, May 7, 2024

స్టీల్ ప్లాంట్ కొనుగోలుదారుడు జ‌గ‌నే – నారా లోకేష్…

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుదారుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అంటూ టిడిపి జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆరోపించారు.. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు..‘‘విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తుంది. జగన్ రెడ్డి కొంటున్నాడు.ఓకే సార్ అంటూ గంగిరెద్దుల్లా తల ఆడించడానికి 28 మంది ఎంపీలు ఎందుకు దండగ. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంత మంది ఉండి ఉపయోగం ఏంటి? విశాఖ ఉక్కుని తుక్కులా కొట్టేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తాం. అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నాం, జగన్ రెడ్డి అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరు చెప్పి లేఖలతో జగన్ రెడ్డి పిరికి కాలక్షేపం,వైకాపా నాయకుల డ్రామాలు ఆపాలి’’ అని లోకేష్ త‌న ట్విట్ల‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement