Wednesday, May 1, 2024

రేపు విజయవాడలో ఓటు వేయనున్న జనసేనాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు విజయవాడ వెళ్లనున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన ఓటు వేయనున్నట్లు జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మేరకు రేపు విజయవాడ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనసేనాని విజయవాడ వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా విజయవాడలోని పడమటలంక జిల్లా పరిషత్ స్కూలులో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన విజయవాడలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement