Wednesday, May 15, 2024

విశాఖ మేయర్ గా గొలగాని హరి వెంకటకుమారి

విశాఖ‌ప‌ట్నం – విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్ గా వైసిపికి చెందిన‌ గొల‌గాని హ‌రి వెంక‌ట కుమారి ఏక గ్రీవంగా ఎన్నిక‌య్యారు.. డిప్యూటీ మేయ‌ర్ గా జియ్యాని శ్రీధ‌ర్ ను ఎన్నుకున్నారు.. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌లో వైసిపి మెజార్టీ స్థానాల‌ను గెలుచుకుంది.. దీంతో మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వుల‌ను ఏక‌గ్రీవంగా కైవ‌సం చేసుకుంది.. కాగా నేటి ఉద‌యం కొత్త‌గా ఎన్నికైన కార్పొరేట‌ర్ల‌తో న‌గ‌ర క‌మిష‌న‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు.. కొత్త‌గా ఎన్నికైన స‌భ్యులు ఆయా పార్టీల కండువాలు ధ‌రించి హాజ‌ర‌య్యారు.. అనంత‌రం మేయ‌ర్,డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌లు నిర్వ‌హించారు.. వైసిపి త‌రుపున ఆయా పోస్టుల‌కు ఒక్కొక్క‌రే నామినేట్ కావ‌డంతో వారి ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement