Saturday, May 4, 2024

టీడీపీలోకి ఏపీ డిప్యూటీ సీఎం ఆడ‌ప‌డుచు


విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వతీపురంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పుష్ప శ్రీవాణి ఆడపడుచు పల్లవి రాజు టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తన తండ్రి శత్రుచర్ల చంద్రశేఖర్ రాజుతో కలిసి ఆమె విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. పుష్ప శ్రీవాణి ఆడపడుచు శత్రుచర్ల పల్లవి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు నాయుడుతోనే అమరావతైనా, గిరిజన ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని పల్లవి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖరరాజు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement