Saturday, April 27, 2024

బోగాపురంలో తీవ్ర ఉద్రిక‌త్త – భూ సేక‌ర‌ణ‌ను అడ్డుకున్న రైతులు..

విజయనగరం: భోగాపురం ఎయిర్ పోర్ట్‌కి అవసరమైన అదనపు భూసేకరణ ఉద్రిక్తంగా మారింది. భూముల సేక‌ర‌ణ‌కు భైరెడ్డిపాలెం దగ్గర భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వేకి సిద్ధమయ్యారు. ఎయిర్‌పోర్టు అప్రోచ్ రహదారికి అవసరమైన సుమారు 130 ఎకరాల సేకరణకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో అధికారుల‌ను స్థానిక రైతులు అడ్డుకున్నారు.. దీంతో పోలీసులు వారిని నిలువ‌రించారు.. ఈ సంద‌ర్భంగా ఒక మ‌హిళ అక్క‌డే సృహ‌తప్పి ప‌డిపోయింది.. త‌మకు ఏ విధ‌మైన నోటీసులు ఇవ్వ‌కుండా భూసేక‌ర‌ణ ఎలా చేస్తార‌ని అధికారుల‌ను రైతులు నిల‌దీశారు..ప్ర‌స్తుతం అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement