Tuesday, May 7, 2024

దిష్టిబొమ్మ దహనం

జూలపల్లి: భారతీయ జనతా పార్టీ జూలపల్లి మండల శాఖ హిందుత్వ వాదులు మండల కేంద్రంలో గురుకులాల విద్యాలయాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల శాఖ అధ్యక్షుడు కూసుకుంట్ల రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ బౌద్ధస్తూపం ఆవిష్కరణ దగ్గర ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రతిజ్ఞ చేపిస్తూ హిందూ దేవతల పట్ల విషం కక్కడం శోచనీయమన్నారు. ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని, విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ మహనీయుడు అందించిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఐపీఎ స్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌ కుమార్‌ రాజ్యాంగ బాధ్యతలకు విరుద్ధంగా హిందువుల విశ్వసాలు గాయపరిచాడన్నారు. స్వేరోస్‌పై ఆరోపణలు వస్తున్నా ప్రవీణ్‌ కుమార్‌ను సుదీర్ఘ కాలంగా ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తుందో సమాధానం చెప్పాలన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు గుమ్మడి శంకరయ్య, కుస్కుంట్ల వెంకటరెడ్డి, లెక్కల వజ్రరెడ్డి, కోడూరి సాంబయ్య, పాఠకుల మహేష్‌, దేవసాని శ్రీనివాస్‌, బెజ్జంకి రమేష్‌, కూసుకుంట్ల మోహన్‌రెడ్డి, పాటకుల మహేశ్‌, సింగిరెడ్డి మహిపాల్‌ రెడ్డి, నగునూరి లక్ష్మన్‌, పోట్టాల శ్రీనివాస్‌, కనపర్తి ఉపేంద్రచారి, బొడిగె లక్ష్మణ్‌, ఒలాజి శ్రీనివాస్‌, కళ్లెం దామోదర్‌ రెడ్డి, రాజు శెట్టి, కుస్కుంట్ల సతీష్‌రెడ్డి, గుడిపాటి అమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement