Thursday, May 2, 2024

వందేభార‌త్ రీ షెడ్యూల్ .. నాలుగు గంట‌లపాటు ఆల‌స్యం

విశాఖ నుంచి రేపు (శ‌నివారం) బయలుదేరాల్సిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రీ షెడ్యూల్‌ చేసినట్టు వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు తెలిపారు. ఉదయం 5.45 గంటలకు బదులుగా 9.45 గంటలకు రైలు బయలుదేరుతుందని వెల్లడించారు. సికింద్రాబాద్‌ నుంచి రావాల్సిన రైలు ఆలస్యంగా నడుస్తుండటమే రీ షెడ్యూల్‌కు కారణమని స్పష్టం చేశారు. విశాఖ-సికింద్రాబాద్‌ (20833) వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 4 గంటలు ఆలస్యంగా బయలుదేర‌నున్న‌ట్టు స‌మాచారం..

Advertisement

తాజా వార్తలు

Advertisement