Friday, May 10, 2024

AP | ఎన్టీఆర్ అంటే ఎన‌లేని అభిమానం.. శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో ర‌జ‌నీకాంత్‌

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు.. నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభ విజయవాడలో ప్రారంభమైంది. పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో జరుగుతున్న కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ, ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే త‌న‌కు ఎన‌లేని అభిమానం అని, త‌న‌ను ఇన్‌స్ఫైర్ చేశార‌న్నారు.

ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై వచ్చిన రెండు పుస్తకాలను ఈ సభలో రజనీకాంత్ ఆవిష్కరించారు. ఓ పుస్తకం కాపీని బాలకృష్ణకు అందించారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలపై ఓ పుస్తకం, ప్రజలను చైతన్యపరుస్తూ చేసిన ప్రసంగాలతో కూడిన మరో పుస్తకాన్ని విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement