Sunday, May 5, 2024

14 నిమిషాల్లో వందే భారత్ క్లీనింగ్..

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో): స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా రైల్వే శాఖ ఈరోజు తిరుపతి రైల్వే స్టేషన్ లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ” 14 నిమిషాల అద్భుతం ” కార్యక్రమాన్ని నిర్వహించింది. 16 కోచ్ ల వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేవలం 14 నిమిషాల్లో శుభ్రం చేయడం ఈ 14 నిమిషాల అద్భుతం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈ కార్యక్రమానికి గుంతకల్ ఎ డి ఆర్ ఎం, సి ఆర్ ఎస్ సి డబ్ల్యూ ఎం, తిరుపతి సి డి ఓ, స్టేషన్ డైరెక్టర్ నాయకత్వం వహించారు. అతి తక్కువ సమయంలో 14 నిమిషాల్లో ఇంత అద్భుతమైన పరిశుభ్రత సాధించడంపై ప్రయాణీకులు అభినందనలు తెలిపారు. రైల్వే అధికారులు నిర్వహించిన స్వచ్ భారత్ కార్యక్రమాల్లో 14 నిమిషాల్లో అద్భుతం కార్యక్రమం హై లైట్ గా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement