Saturday, May 18, 2024

కొచ్చి నుంచి దోహాకు ఎయిరిండియా సర్వీసులు

కేరళలోని వాణిజ్య కేంద్రమైన కొచ్చిని ఖతార్‌ రాజధాని దోహాతో కలుపుతూ అక్టోబర్‌ 23 నుంచి రోజువారీ నాన్‌స్టాప్‌ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌ఇండియా ఆదివారం తెలిపింది. భారత కాలమానం ప్రకారం ఏఐ953 మధ్యా#హ్నం 1:30 గంటలకు బయలుదేరుతుంది. మధ్యా#హ్నం 3:45 గంటలకు దోహా చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఏఐ954 దోహా నుండి సాయంత్రం 4:45 గంటలకు బయలుదేరి 11:35 గంటలకు కొచ్చిలో దిగుతుంది.

- Advertisement -

”ఎ320 నియో ఎయిర్‌క్రాప్ట్‌nతో నడిచే ఈ విమానంలో 162 సీట్లు (ఎకానమీలో 150, బిజినెస్‌ క్లాస్‌లో 12) అందుబాటులో ఉంటాయి” అని సంబంధిత అధికారి తెలిపారు. కొత్త ఎయిర్‌క్రాప్ట్‌nలతో తన విమానాలను పెంపొందించుకుంటూ దేశీయ, అంతర్జాతీయ రంగాలలో కనెక్టివిటీని విస్తరించేందుకు, ఫ్రీక్వెన్సీని పెంచడానికి ఎయిర్‌ ఇండియా నిబద్ధతకు అనుగుణంగా ఈ కొత్త ప్రయోగం ఉంది” అని ఎయిర్‌లైన్‌ ప్రతినిధి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement