Monday, May 6, 2024

వైసీపీ పాలనలో అన్నింటా దోపిడీ జరుగుతుంది : బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి

దోపిడీనే ప్ర‌ధాన ఎజెండాగా పెట్టుకుని వైసీపీ పాల‌న కొన‌సాగిస్తుంద‌ని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ ప్ర‌భుత్వం ప్రజలను సోమరులను చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని మొదటి నుండి బీజేపీ తీక్షణంగా గమనిస్తోందని, దోపిడీని ప్రధాన అజెండాగా పెట్టుకుని ముందుకు వెళుతున్నారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కేసులు బనాయిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని ఓటర్లను ఆకట్టుకోవడానికి మతరాజకీయాలను చేస్తున్నారు అంటూ ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement