Monday, April 29, 2024

Blast – కుప్పంలో భారీ పేలుడు – ఇల్లు ధ్వంసం … దంపతులకు తీవ్ర గాయాలు

చిత్తూరు జిల్లా. కుప్పంలో భారీ పేలుడు కలకలం రేపింది. ఓ ఇంట్లో నాటుబాంబు పేలడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇంట్లోని మురుగేష్, ధనలక్ష్మి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు.

పేలుడు సమాచారం తెలియడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పేలుళ్లపై దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కారణం నాటుబాంబులా, జిలెటిన్ స్టిక్సా అనేది తేలాల్సి ఉందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిముందు నాటుబాంబులు పేల్చినట్లు సమాచారం. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. వీరిని టార్గెట్ చేసే పేలుళ్లకు పాల్పడ్డారా? లేక ఇంకేదైనా కారణముందా? తేలాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement