Friday, May 3, 2024

Transfers – ఈసీ ఆదేశాలు.. ఏపీలో40 మంది తహశీల్దార్ల బదిలీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ లో 40 తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్ 3లో 21 మంది, జోన్‌-4 పరిధిలోని 21 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్‌ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బ‌దిలీకి గురైన వారంతా ఆరు నుంచి మూడు నెల‌ల‌లోపే పోస్టింగ్ లు పొందిన వారే కావ‌డం విశేషం.. క‌ర్నూలు, స‌త్య‌సాయి, క‌డ‌ప‌, అనంత‌పురం, బాప‌ట్ల‌, ప్ర‌కాశం, నెల్లూరు, జిల్లాల‌కు చెందిన 40 మందిని ఏక‌కాలంలో బ‌దిలీ చేశారు.. అలాగే జోన్ 1,2 లో సైతం బ‌దిలీల‌పై నేడు ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌వ‌చ్చ‌నే వార్త‌లు విన‌వ‌స్తున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement