Sunday, May 19, 2024

ఏపీలో జిల్లా జడ్జీల బదిలీలు.. కోర్టుల వారీగా వివ‌రాలు..

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున జిల్లా, అదనపు జిల్లా జడ్జీలను బదిలీలు చేస్తూ హైకోర్టు ఇవ్వాల (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వెంకట జ్యోతిర్మయి, కడప జిల్లా న్యాయమూర్తిగా ఎన్‌. సలోమన్‌ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సి. పురుషోత్తం కుమార్‌, చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇ. భీమారావు, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వైవిఎస్‌ పార్థసారథిలను నియమించింది.

అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బి. శ్రీనివాస్‌, కృష్ణ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా అరుణ సారిక , ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎ. భారతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా అదనపు జిల్లా జడ్జీలను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement