Sunday, May 5, 2024

Trains cancelled – రేపటి నుంచి వారం పాటు 28 రైళ్లు, 23 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల పనుల నేపథ్యంలో .ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు .

28 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేయగా.. ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే, గుంతకల్‌-బోధన్‌ రైలు సమయంలో తాత్కాలికంగా మార్పులు చేసినట్టు తెలిపారు.

23 ఎంఎంటీఎస్‌ రైళ్లు

దీంతో పాటు హైదరాబాద్‌ జంటనగరాల్లో ప్రజలకు సర్వీసులందించే 23 ఎంఎంటీఎస్‌ రైళ్లను సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement