Monday, April 29, 2024

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. హ‌త్యా, ఆత్మ‌హ‌త్యా?

మోతె, (ప్రభన్యూస్): న‌ల్గొండ జిల్లా మోతె మండ‌లంలో ఓ మ‌హిళ మృతి అనుమానాస్పదంగా మారింది. మామిళ్ల‌గుడెం సర్పంచ్ వ్యవసాయ క్షేత్రంలోని చెరువులో పడి ఓ మ‌హిళ చ‌నిపోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గుండెపంగు మౌనిక త‌న భర్త నాగరాజుతో విడిపోయింది. వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ఏడాది కాలంగా వేరుగా ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భ‌ర్త నుంచి విడిపోయిన త‌ర్వాత మౌనిక తన తల్లిగారి ఇంటి వద్ద (కేశవపురం) ఉంటోంది.

అయితే.. రెండు నెలలుగా తన రెండో కుమారుడు నవీన్ తో కలిసి మౌనిక‌ హైదరాబాదులో ఉంటున్నట్లు స్థానికులు చెప్పారు. కాగా, రెండు రోజుల క్రితం తుమ్మలపల్లి గ్రామంలోని దేవుడమ్మ వద్దకు ఆమె వచ్చినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ క్ర‌మంలోనే చ‌నిపోయి ఉంటుంద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆమె మ‌ర‌ణ వార్త‌ను పోలీసులు మృతురాలి భర్త నాగరాజుకు తెలిపారు. ఈ విష‌యంలో నాగరాజు దేవుడమ్మ తిరుపమ్మ వారి కుటుంబ సభ్యులపై అనుమానంగా ఉంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా ఎస్సై మహేష్ కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement