Saturday, May 4, 2024

Tirumala – 10వ తేదిన ఎస్ఇడి, శ్రీ‌వాణి, గ‌దుల కోటా విడుద‌ల‌

తిరుమల – డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు, గ‌దుల కోటాను ఈ నెల 10న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. మొత్తం 2.25 ల‌క్ష‌ల రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ను ఉద‌యం 10 గంట‌ల‌కు, రోజుకు 2 వేలు చొప్పున 20 వేల శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు, గ‌దుల కోటాను సాయంత్రం 5 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించ వ‌ల‌సిందిగా టిటిడి ఈవో తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement